ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: ఆగివున్న లారీని ఢీకొన్న బైక్.. ముగ్గురు మృతి

ABN, Publish Date - Aug 19 , 2024 | 10:32 AM

రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలను హరిస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి మరో ఘోరమైన ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident

పిడుగురాళ్ల: రోడ్డు ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలను హరిస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి మరో ఘోరమైన ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.

మృతులు అంతా పిడుగురాళ్లకు చెందిన వారిగా తెలిసింది. మృతులు మారూరి నాగ తేజ రెడ్డి (25), ఇందూ (30), అమూల్యగా (15) గుర్తించారు. గురజాలలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పిడుగురాళ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


మాచర్లలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తింపు..

పల్నాడు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. కృష్ణవేణి పుష్కర్ ఘాట్ వద్ద గుర్తించిన ఈ మృతదేహాం పూర్తిగా కాలిపోయి ఉంది. డెడ్‌బాడీ వద్ద పెట్రోల్ డబ్బాతో పాటు వాటర్ బాటిల్స్‌ ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


బైక్- కారు ఢీ.. ఇద్దరు మృతి

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలూం గ్రామ మలుపు వద్ద బైక్- కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు చెర్లోపల్లి గ్రామానికి చెందిన కిరణ్, వెంకటాపురం గ్రామానికి చెందిన కుమార్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Updated Date - Aug 19 , 2024 | 10:32 AM

Advertising
Advertising
<