ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: బాపట్ల జిల్లాలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన

ABN, Publish Date - Feb 17 , 2024 | 08:45 AM

బాపట్ల జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్చూరు నియోజక వర్గంలోని ఇంకొల్లులో మధ్నాహ్నం రా కదలి రా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్నాహ్నం 2.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా చంద్రబాబు బయలు దేరి 2.55 గంటలకు ఇంకొల్లు చేరుకుంటారు.

బాపట్ల జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పర్చూరు నియోజక వర్గంలోని ఇంకొల్లులో మధ్నాహ్నం రా కదలి రా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్నాహ్నం 2.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్ ద్వారా చంద్రబాబు బయలుదేరి 2.55 గంటలకు ఇంకొల్లు చేరుకుంటారు. 3.15 గంటలకు రా కదలి రా బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఇంకొల్లు నుంచి ఉండవల్లికి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి వెళతారు. కాగా చంద్రబాబు బహిరంగ సభ నిర్వహణ కోసం టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

జగన్ అరాచక పాలనను సాగనంపేందుకే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘రా కదిలిరా’ సభతో శంఖారావం పూరిస్తున్నారని ఆపార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, పర్చూరు ఎమ్మోల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఈరోజు బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో రా కదిలిరా బహిరంగ సభ.. ఇంకొల్లులో నిర్వహిస్తున్నారన్నారు. జగన్‌ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాన్ని వివరించి ప్రజలను చైతన్యం చేసేందుకు రా కదిలిరా పేరుతో చంద్రబాబు శనివారం ఇంకొల్లులో తారకరామ విజయభేరి ప్రాంగణంలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సుమారు లక్ష మంది లక్ష్యంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏలూరి సాంబశవరావు చెప్పారు.

Updated Date - Feb 17 , 2024 | 08:46 AM

Advertising
Advertising