టీడీపీ అభ్యర్థిగా షాజహానబాషా ప్రకటనపై సంబరాలు
ABN, Publish Date - Mar 15 , 2024 | 12:07 AM
మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా ఎం.షాజహానబాషా పేరును అధిష్ఠానం ప్రకటించడంపై పట్టణంలోని ఆ పార్టీశ్రేణులు సంబరాలు జరుపుకున్నా రు.
మదనపల్లె, మార్చి 14: మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా ఎం.షాజహానబాషా పేరును అధిష్ఠానం ప్రకటించడంపై పట్టణంలోని ఆ పార్టీశ్రేణులు సంబరాలు జరుపుకున్నా రు. టీడీపీ శ్రేణులతోపాటు ఆయన అభి మానులు చేసుకున్న సంబరాలు అంబ రాన్ని అంటాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పేరు ప్రకటించగానే, స్థాని క బెంగళూరు బస్టాండులో బాణాసంచా పేల్చారు. అక్కడి నుంచి మల్లికార్జున సర్కిల్, ఎనటీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె, అంబేడ్కర్ సర్కిల్, సీటీఎం రోడ్డు మీదుగా ద్విచక్ర వాహన ర్యాలీ కార్యాలయానికి చేరుకున్నారు. టీడీపీ జిందాబాద్, చంద్రబాబు జిందా బాద్, షాజహానబాషా నాయకత్వం వర్థిల్లాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు పఠాన ఖాదర్ఖాన, పూలకుంట్ల హరి, టౌనబ్యాంకు మాజీ చైర్మన ఎన.విద్యాసాగర్, బాలుస్వామి, జునైద్ అక్బరీ, గౌతమ్రెడ్డి, షంషీర్, నవీనచౌదరి, నాగూర్వలి, తదితరులు పాల్గొన్నారు.
నిమ్మనపల్లిలో: మదనపల్లె టీడీపీ అభ్యర్థిగా షాజహనబాషాకు టికెట్ రావడంతో మండ లంలోని టీడీపీ నేతలు మాజీ మండల అధ్య క్షుడు రాజన్న ఆద్వర్యంలో సంబరాలు చేసుకొ న్నారు. గురువారం స్థానిక ఆలయంలో పూజ లు నిర్వహించి బంస్టాడు కూడలిలో బాణ సం చా పేల్చి మిఠాయిలు పంచుకొని వచ్చే ఎన్నిక ల్లో టీడీపీ విజయం తఽథ్యమని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు శ్రీపతి, రమణ, రామకృష్ణ, ఫమాజ్. ఖనసాబ్, జయన్న, రెడ్డిప్ప జగధీష్, షపి తదితరుల పాల్గొన్నారు.
Updated Date - Mar 15 , 2024 | 12:07 AM