ఆదరించి గెలిపిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా
ABN, Publish Date - Mar 16 , 2024 | 12:00 AM
రాబోవు ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపి స్తే నిరుపేదల సంక్షేమం, మండ లంలో అభివృద్ధి చేసి చూపిస్తానని పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిశోర్ కుమార్రెడ్డి పేర్కొన్నారు.
ఇంటింటా ప్రచారంలో నల్లారి కిశోర్కుమార్రెడ్డి
వాల్మీకిపురం, మార్చి 15: రాబోవు ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపి స్తే నిరుపేదల సంక్షేమం, మండ లంలో అభివృద్ధి చేసి చూపిస్తానని పీలేరు టీడీపీ అభ్యర్థి నల్లారి కిశోర్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. మండ లంలోని చింతపర్తి గ్రామ పంచా యతీ చెరువుముందరపల్లె, నాయన వారిపల్లె, కోటపల్లె, తాళ్లపల్లె, పుల్లేటిచె రువుపల్లె, దాసరివారిపల్లె, పాతకోటప ల్లెలలో శుక్రవారం ఆయన బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఇంటింటా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పుల్లేటిచెరువుపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో హామీల మీద హామీలు ఇస్తూ అధికారం చేపట్టిన సీఎం జగన రాబోయే ఎన్నికల్లో ఓటమితో తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన కంభం నిరంజనరెడ్డి, సర్పంచ మహిత శేషాద్రిరెడ్డి, పీలేరు టీడీపీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు లంకిపల్లె మధు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటరమణ, బీజేపీ, జనసేన మండల పార్టీ అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి, కిశోర్, నాయకులు కృష్ణారెడ్డి, చంద్రమౌళి, పీవీ నారాయణ, కోసూరి రమేష్, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు.
Updated Date - Mar 16 , 2024 | 12:00 AM