ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mandipalli Ramprasad Reddy భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు

ABN, Publish Date - Sep 25 , 2024 | 10:35 PM

నియోజకవర్గంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

అర్జీలు స్వీకరిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

చిన్నమండెం, సెప్టెంబరు 25: నియోజకవర్గంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. బుధవారం చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లె లోని తమ నివాసంలో రాంప్రసాద్‌రెడ్డి ప్రజా ద ర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వీటి పరిష్కా రానికి చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభు త్వంలో పేదల భూములన్నీ కొంత మంది బడా నాయకులు ఆక్రమించు కున్నారని, అవన్నీ తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెడతామ న్నా రు. జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, రాజంపేట నియోజకవర్గాల్లో భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రాబోయే ఐదేళ్లలో భూ బాధితుల సమస్యలను అప్పటి కప్పుడే పరిష్కరించి న్యాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలు మూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో మంత్రికి వినతి పత్రా లు సమర్పించారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కరి స్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Sep 25 , 2024 | 10:35 PM