ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం

ABN, Publish Date - Sep 20 , 2024 | 12:10 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షిస్తామని కడప వనటౌన సీఐ బి.రామక్రిష్ణ అన్నారు.

మాట్లాడుతున్న సీఐ రామక్రిష్ణ

వనటౌన సీఐగా బాధ్యతలు చేపట్టిన రామక్రిష్ణ

కడప (క్రైం), సెప్టెంబరు 19 : ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షిస్తామని కడప వనటౌన సీఐ బి.రామక్రిష్ణ అన్నారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్కా, గంజాయి, జూదం బెట్టింగ్‌లాంటి వాటిపై నిఘా ఉంచుతామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీలు, అనుమానితులపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, రాత్రి సమయం లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే తమకు సమాచారం అందిస్తే పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిరోజూ సాయంత్రం మైనర్‌ డ్రైవింగ్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన ఈయన 2004 బ్యాచ చెందిన వారు. ఎస్‌ఐగా కడప జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషనలో విధులు నిర్వహించారు. సీఐగా పదోన్నతి పొంది కర్నూలు, కడపలో పనిచేస్తూ ప్రస్తుతం కర్నూలు నుంచి కడప వనటౌనకు బదిలీపై వచ్చారు.

Updated Date - Sep 20 , 2024 | 12:10 AM