ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కన్నతండ్రే కాలయముడు!

ABN, Publish Date - Mar 14 , 2024 | 04:18 AM

కన్నతండ్రే కాలయముడిగా మా రాడు.. ఇప్పుడప్పుడే చిట్టిచిట్టి మాటలతో.. బుడిబుడి అడుగులతో ఇంట్లో సందడి చేస్తున్న కన్నకూతురిని కర్కశంగా గొంతుకోసి హతమార్చాడు. ఈ సంఘటన కర్నూలు

భార్యపై అనుమానంతో కూతురి గొంతు కోశాడు

కర్నూలు జిల్లాలో దారుణం

కోసిగి, మార్చి 13: కన్నతండ్రే కాలయముడిగా మా రాడు.. ఇప్పుడప్పుడే చిట్టిచిట్టి మాటలతో.. బుడిబుడి అడుగులతో ఇంట్లో సందడి చేస్తున్న కన్నకూతురిని కర్కశంగా గొంతుకోసి హతమార్చాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని జంపాపురంలో బుధవారం చోటుచేసుకుంది. జంపాపురం ఎస్సీ కాలనీలో కగల్లు శాంతి కుమార్‌, ఆశీర్వాదమ్మలకు మూడేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి 18 నెలల వర్షిణి అనే కూతురు ఉంది. తండ్రి శాంతకుమార్‌ భార్య ఆశీర్వాదమ్మపై అనుమానం పెంచుకుని.. వర్షిణి తనకు పుట్టలేదని, తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఆ పాపను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. నిద్రలేచి చూసిన తల్లి ఆశీర్వాదమ్మ బిడ్డ కనిపించకపోవడంతో ఇంటి పరిసరాల్లో కంగారుగా వెతికింది. పశువుల పాకలో రక్తపుమడుగులో ఉన్న చిన్నారి వర్షిణిని చూసి కుప్పకూలింది. తండ్రే హత్య చేసినట్లు గుర్తించిన గ్రామస్థులు శాంతికుమార్‌ను ఓ గదిలో బంధించారు. బుధవారం ఉదయం సీఐ ప్రసాద్‌, ఏఎ్‌సఐ నాగరాజు ఘటనా స్థలికి చేరుకుని, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. భార్యపై అనుమానంతోనే తన కుమార్తెను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు సీఐ ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Mar 14 , 2024 | 04:18 AM

Advertising
Advertising