పాడిరైతులకు ఆదర్శంగా చలసాని ఆంజనేయులు
ABN, Publish Date - Sep 20 , 2024 | 01:04 AM
ష్ణామిల్క్ యూనియన్కు పాలు సర ఫరా చేయడంలో తృతీయ స్థానం సాధించిన యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాడిరైతులకు ఆదర్శంగా నిలచారని యూని యన్ సభ్యులు పేర్కొన్నారు.
పాల సరఫరాలో తృతీయ స్థానం..చైర్మన్ను అభినందించిన కృష్ణా మిల్క్ యూనియన్ సభ్యులు
హనుమాన్జంక్షన్రూరల్, సెప్టెంబరు 19: కృష్ణామిల్క్ యూనియన్కు పాలు సర ఫరా చేయడంలో తృతీయ స్థానం సాధించిన యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాడిరైతులకు ఆదర్శంగా నిలచారని యూని యన్ సభ్యులు పేర్కొన్నారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పాడి రైతులకు, సేల్స్ ఏజెంట్లకు వివిధ విభాగాల్లో బహుమతులు అందజేశారు. కాకులపాడులోని పాల సొసైటీకి పాలు పోస్తూ యూనియన్ స్థాయిలో చలసాని ఆంజనేయులు మూడో స్థానం సాధించడంతో ఆయకు కూడా పాలకవర్గ సభ్యులు బహుమతి అందజేశారు. చలసానిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దాస రి బాలవర్ధనరావు, పాలకవర్గ సభ్యులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Sep 20 , 2024 | 01:04 AM