ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నష్టపరిహారం ఇప్పిస్తా

ABN, Publish Date - Jul 21 , 2024 | 01:31 AM

విజయవాడ-నాగపూర్‌ 163(జీ) గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) హామీ ఇచ్చారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు భూములిచ్చిన రైతులతో కేశినేని చిన్ని

విద్యాధరపురం, జూలై 20: విజయవాడ-నాగపూర్‌ 163(జీ) గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) హామీ ఇచ్చారు. జి.కొండూరు మండలం కవులూరుకు చెందిన రైతులు శని వారం ఎంపీని కలిశారు. తమకు నష్ట పరిహారం ఇప్పించాలని ఎంపీని కోరారు. అధికారులతో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తా నని చిన్ని హామీ ఇచ్చారు. గ్రామంలో 170 మంది హైవే నిర్మాణం కోసం భూములిచ్చారని, వారిలో 60 మందికే నష్ట పరిహారం అందిందని రైతులు తెలిపారు. మరో 20 మందికి అవార్డు వచ్చిందని, మిగిలిన 90 మందికి అవార్డు కాపీ రాలేదని, గెజిట్‌లో నమోదు కాలేదని వివరించారు. జంపాల సీతారామయ్య, భోగినేని రవీంద్రరావు, చెరుకూరి వేణుగోపాల్‌, భోగినేని సూర్యప్రకాష్‌రెడ్డి, మల్లేశ్వరరావు, ఆశోక్‌ పాల్గొన్నారు. చిన్నిని సత్కరించారు.

Updated Date - Jul 21 , 2024 | 08:18 AM

Advertising
Advertising
<