టీడీపీతోనే బీసీలకు ప్రాధాన్యం
ABN, Publish Date - Sep 21 , 2024 | 01:21 AM
తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు ప్రాఽధాన్యత పెరిగిందని బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్ అన్నారు.
కర్నూలు(అర్బన), సెప్టెంబరు 20: తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు ప్రాఽధాన్యత పెరిగిందని బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ పట్ల చిత్తశుద్ధి ఉన్న ఏకైన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. కార్యక్రమంలో నాగరాజు యాదవ్, విజయకుమార్, సోమిశెట్టి నవీన, బతేం క్రిష్ణుడు, విజయలక్ష్మి, కె. మహేష్ గౌడ్, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 01:21 AM