ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘విమానాశ్రయ విస్తరణకు సహకరించండి’

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:46 AM

ఓర్వకల్లు సమీపంలో విమానాల ల్యాండింగ్‌, ఎయిర్‌పోర్టు విస్తరణకు రైతులు సహకరించాలని తహసీల్దార్‌ వెంకటరమణ కోరారు.

రైతులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ వెంకటరమణ

ఓర్వకల్లు, సెప్టెంబరు 4: ఓర్వకల్లు సమీపంలో విమానాల ల్యాండింగ్‌, ఎయిర్‌పోర్టు విస్తరణకు రైతులు సహకరించాలని తహసీల్దార్‌ వెంకటరమణ కోరారు. బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఓర్వకల్లు పొలిమేరలోని 551, 557, 539, 606, 701 సర్వే నెంబర్లలోని రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు, అడంగల్‌, ఆర్‌ఎస్‌ఆర్‌, ఆర్‌వోఆర్‌లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ వెంకటరమణ మాట్లాడుతూ ఓర్వకల్లు పొలి మేరలో 36 ఎకరాల 48 సెంట్ల భూమిని విమానాశ్రయం విస్తరణకు సేకరించామన్నారు. ఇందులో 36 ఎకరాల 48 సెంట్లు ప్రభుత్వ భూమి ఉందని, అందులో మూడెకరాల 32 సెంట్లు పట్టాభూమి ఉందని తెలిపారు. ఆ భూములను సర్వే చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ సతీష్‌, సర్వేయర్‌ జయరాముడు, వీఆర్వో కృష్ణదేవరాయలు, పూడిచెర్ల రైతులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:46 AM

Advertising
Advertising