గర్భిణి మృతి
ABN, Publish Date - Jul 27 , 2024 | 12:11 AM
ఆళ్లగడ్డ పట్టణంలోని పాత మసీ దు వీధిలో నివాసం ఉంటున్న నిండునెలల గర్భిణి గౌసియా(28) శుక్రవా రం ఆసుపత్రిలో మృతి చెందారు.
నంద్యాల, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ పట్టణంలోని పాత మసీ దు వీధిలో నివాసం ఉంటున్న నిండునెలల గర్భిణి గౌసియా(28) శుక్రవా రం ఆసుపత్రిలో మృతి చెందారు. తనకు ఆరోగ్యం బాగా లేదంటూ ఉద యం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు. దీంతో సిబ్బంది ఆమెకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించారు. ఇంతలోనే ఫిట్స్ రావడం తో ఆమె చనిపోయారు. గౌసియా రెండో కాన్పుగా వైద్యులు గుర్తించారు. దీనిపై వైద్యశాల సూపరింటెండెంట్ సుజాతమ్మ మాట్లాడుతూ మృతురాలు చాలా బలహీనంగా ఉందని, ఉమ్మనీరు పోతుండటంతో వైద్యశాలకు వచ్చిందని చెప్పారు. దీంతో ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఏ లోపం లేదని తెలిపారు. ఈలోగా గౌసియాకు ఫిట్స్ రావడంతో చనిపోయిందని తెలిపారు.
Updated Date - Jul 27 , 2024 | 12:11 AM