నంద్యాలకు చేరుకున్న నారా భువనేశ్వరి
ABN, Publish Date - Apr 05 , 2024 | 01:31 AM
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్తో పలువురు ఆ పార్టీ అభిమానులు గుండెపోటుతో మృతి చెందిన విషయం విధితమే.
నంద్యాల రూరల్, ఏప్రిల్ 4: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్తో పలువురు ఆ పార్టీ అభిమానులు గుండెపోటుతో మృతి చెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంతో బాధితులను పరామర్శించటానికి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పరామర్శ యాత్ర నిర్వహిస్తున్నారు. కార్య క్రమంలో భాగంగా గురువారం నంద్యాల చేరుకున్న నారా భువనేశ్వరికి ఎన్ఎండీ ఫరూక్, ఏవీఆర్ ప్రసాద్, టి. తులశీరె డ్డిలు స్వాగతం పలికారు. భువనేశ్వరి శుక్రవారం ఉదయం పట్టణంలోని 34, 13 వార్డులు పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం మహానందిలో పర్యటించి తిరిగి రాత్రి నంద్యాల ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో బస చేస్తారు. శనివారం ఉదయం అదే ఫంక్షన్ హాల్లో మహిళలతో ముఖాముఖి నిర్వహించి పాణ్యం బయలుదేరి వెళ్తారు. నిజం గెలవాలి పర్యటనను విజయవంతం చేయాలని నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పిలుపునిచ్చారు.
Updated Date - Apr 05 , 2024 | 01:31 AM