ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రజలు మా వెంటే.. : కోట్ల

ABN, Publish Date - May 29 , 2024 | 12:03 AM

ప్రజలు తమ వెంటే ఉన్నారని డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు.

డోన్‌(రూరల్‌), మే 28: ప్రజలు తమ వెంటే ఉన్నారని డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. మం గళవారం టీడీపీ కార్యాలయం ఆవరణలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే డోన్‌ నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామని, మొదటి ప్రాధాన్యతగా తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే రైతులకు మేలు చేకూరే విధంగా సాగునీటి కోసం ప్రాధాన్యతనిచ్చి పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరు స్తామన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, మండల కార్యదర్శి వెంకటనాయునిపల్లె శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, మాజీ సర్పంచ్‌ పెద్ద కేశవయ్యగౌడు, టీడీపీ నాయకులు ఓబులాపురం శేషిరెడ్డి, సీలం భాస్కర్‌ నాయుడు, ఓంప్రకాష్‌, జనసేన నియోజకవర్గ నాయకులు ఆలా మోహన్‌ రెడ్డి, జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్‌ గడ్డం బ్రహ్మం పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 12:03 AM

Advertising
Advertising