ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పెట్నికోటలో పర్యటించిన ఎస్పీ

ABN, Publish Date - Jun 02 , 2024 | 10:57 PM

ఇటీవల పోలింగ్‌ సందర్భంగా ఘర్షణ తలెత్తిన పెట్నికోట గ్రామాన్ని నంద్యాల ఎస్పీ కె. రఘువీర్‌రెడ్డి ఆదివారం సందర్శించారు.

కొలిమిగుండ్ల రూరల్‌, జూన్‌ 2: ఇటీవల పోలింగ్‌ సందర్భంగా ఘర్షణ తలెత్తిన పెట్నికోట గ్రామాన్ని నంద్యాల ఎస్పీ కె. రఘువీర్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. గ్రామంలో కొనసాగుతున్న పోలీసు పికెట్‌ను పరిశీలించి, ఘర్షణల నివారణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి సీఐ గోపినాథ్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్‌ నేపథ్యంలో ఏజంట్లు, అభ్యర్థులు మినహా ఎవ్వరూ కౌంటింగ్‌ కేంద్రాలకు రాకుండా స్థానిక పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం కొలిమిగుండ్ల పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ గోపినాథ్‌ రెడ్డి, ఎస్బీ ఎస్‌ఐ హరినాథరెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

ఆకస్మిక తనిఖీ

బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలో ఎన్నికల కౌంటింగ్‌ సందర్భం గా రెండు రోజులుగా వివిధ కూడళ్లలో నిర్వహిస్తున్న పోలీస్‌ పికెట్‌ను ఆదివారం ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని పోలీస్‌ పికెట్‌లను తనిఖీ చేసి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుం డా జాగ్రత్తగా ఉండాలని పికెట్‌ సిబ్బందిని ఆదేశించారు. విజయోత్సవ ర్యాలీలు జరగకుండా, టపాసులు పేల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.

Updated Date - Jun 02 , 2024 | 10:57 PM

Advertising
Advertising