ఓట్ల లెక్కింపునకు సహకరించాలి: ఆర్వో
ABN, Publish Date - May 29 , 2024 | 12:01 AM
ఓట్ల లెక్కింపునకు రాజకీయ పార్టీ అభ్యర్థులు తమ వంతు సహకారం అందించాలని ఆర్వో మల్లికా ర్జునరెడ్డి కోరారు.
నంద్యాల, మే 28(ఆంధ్రజ్యోతి): ఓట్ల లెక్కింపునకు రాజకీయ పార్టీ అభ్యర్థులు తమ వంతు సహకారం అందించాలని ఆర్వో మల్లికా ర్జునరెడ్డి కోరారు. ఆళ్లగడ్డ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల అభ్యర్థులతో, పోలీసు అధికారులతో, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీ నంద్యాల శాంతిరామ్ కళాశాలలో జరుగుతుందని, ఇందుకు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాలని కోరామని చెప్పారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు సూచించిన వారికే గుర్తింపు కార్డులు జారీ చేస్తామని తెలిపారు. సమావేశంలో ఏఆర్వో నజీర్ అహమ్మద్, డిఎస్పీ షర్ఫుద్దీన్, సీఐ రమేష్బాబు, ఎస్ఐలు పాల్గొన్నారు.
Updated Date - May 29 , 2024 | 12:01 AM