ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nara Bhuvaneswari: బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న భువనేశ్వరి

ABN, Publish Date - Jan 05 , 2024 | 12:46 PM

విశాఖలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం జరుగుతోంది. విశాఖ జిల్లాలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మనస్థాపం చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.

విశాఖపట్నం: విశాఖలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమం జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మనస్థాపంతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. విశాఖ జిల్లాలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. దక్షిణ నియోజకవర్గంలో ఇద్దరు, ఉత్తర నియోజకవర్గంలో ఇద్దరు, గాజువాకలో ముగ్గురు కార్యకర్తలు మృతి చెందారు.

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వెంకటేశ్వర్ మెట్ల వద్ద ఒక బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. విశాఖ సౌత్ నియోజకవర్గం, విశాఖ 33వ వార్డులో, జాగరపు చిన్న కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

Updated Date - Jan 05 , 2024 | 01:16 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising