ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anna Canteens: రాష్ట్రవ్యాప్తంగా సందడి అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలు

ABN, Publish Date - Aug 16 , 2024 | 09:10 AM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చినట్టుగా ‘అన్న క్యాంటీన్లు’ పున:ప్రారంభమయ్యాయి. నిన్న (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చినట్టుగా ‘అన్న క్యాంటీన్లు’ పున:ప్రారంభమయ్యాయి. నిన్న (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు సందడిగా ప్రారంభమవుతున్నాయి.


నెల్లూరులో..

జిల్లాలో పండుగ వాతావరణంలో అన్నా క్యాంటిన్ల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది అన్న క్యాంటిన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. పాత మునిసిపల్ ఆఫీస్ వద్ద మంత్రి ఆనం, చేపల మార్కెట్ వద్ద మంత్రి నారాయణ, కూరగాయల మార్కెట్ వద్ద ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్ది, ఇందిరా భవన్ వద్ద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతులు మీదుగా అన్న క్యాంటిన్ల ప్రారంభం అయ్యాయి. అన్న క్యాంటిన్ల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపించారు.


గుంటూరు జిల్లాలో..

గుంటూరు నగరంలో పండుగలా అన్న క్యాంటిన్లు ప్రారంభం అయ్యాయి. బస్టాండ్ సెంటర్, నల్ల చెరువు ప్రాంతాలలో అన్న క్యాంటిన్లను ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. మార్కెట్ సెంటర్, చుట్టుగుంట, మిర్చి యార్డ్ సెంటర్‌లలో ఎమ్మెల్యే గల్లా మాధవి ‘అన్న క్యాంటిన్’లను ప్రారంభించారు. ఆర్టీఓ ఆఫీస్, ఫీవర్ ఆసుపత్రి సెంటర్‌లలో ఎమ్మెల్యే రామాంజనేయలు ప్రారంభించారు.


తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్..

తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ‘అన్న క్యాంటీన్’లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజా కూడా ఉన్నారు. మార్కెట్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లలో వీరు అన్న క్యాంటీన్లను ప్రారంభం చేశారు. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అన్న క్యాంటీన్‌ని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు.


ఏలూరు జిల్లాలో..

ఏలూరు జిల్లా నూజివీడు‌లోని ఆర్‌ఆర్ పేటలో అన్న క్యాంటీన్‌ను రాష్ట్ర గృహానిర్మాణ, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు.


బాపట్ల జిల్లాలో..

బాపట్లలో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ , జిల్లా కలెక్టర్ మురళి అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ‘బ్లూ ప్లేట్ హోటల్’ అధినేత మువ్వ వెంకటేశ్వరరావు ‘అన్న క్యాంటీన్’కి లక్ష రూపాయలు విరాళం అందించారు. జిల్లా కలెక్టర్ మురళికి తన విరాళం చెక్‌ను అందజేశారు.

Updated Date - Aug 16 , 2024 | 09:14 AM

Advertising
Advertising
<