ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీతోనే బీసీల సంక్షేమం

ABN, Publish Date - Mar 24 , 2024 | 11:50 PM

బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాధాన్యం టీడీపీతోనే సాధ్యమని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు అభ్యర్థిదామచర్ల జనార్దన్‌ అన్నారు. నగరంలోని గోపాల్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమావేశంలో దామచర్ల పాల్గొని మాట్లాడారు.

గుర్రపుబండి మీద జనార్దన్‌కు గజమాల వేస్తున్న యాదవులు

యాదవుల ఆత్మీయ సమావేశంలో పార్టీ జనార్దన్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), మార్చి 24 : బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాధాన్యం టీడీపీతోనే సాధ్యమని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు అభ్యర్థిదామచర్ల జనార్దన్‌ అన్నారు. నగరంలోని గోపాల్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమావేశంలో దామచర్ల పాల్గొని మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం టీడీపీ ఆవిర్భవించిందన్నారు. వారికి చట్టసభల్లో సమన్యాయం కల్పించిందన్నారు. రాజకీయం, సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం యాదవ సామాజికవర్గం కృషి చేయాలన్నారు. తనను మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంపై దామచర్ల, రియాజ్‌, రాచగర్ల వెంకట్రావులను గోపాలనగరంలో ఊరేగించి, గజమాలతో సత్కరించారు. ఈ ఆత్మీయ సమావేశంలో స్థానికులు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 11:51 PM

Advertising
Advertising