రైసు మిల్లులో రేషన్ బియ్యం
ABN, Publish Date - Mar 26 , 2024 | 01:08 AM
మండలంలోని రాజుపాలెంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర రైస్మిల్లుపై ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డీటీ జితేంద్ర, వీఆర్వోలు ఖాసింపీరా, శివలింగయ్య దాడి చేశారు.
రాజుపాలెంలో 756 బస్తాలు పట్టివేత
త్రిపురాంతకం, మార్చి 25 : మండలంలోని రాజుపాలెంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర రైస్మిల్లుపై ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డీటీ జితేంద్ర, వీఆర్వోలు ఖాసింపీరా, శివలింగయ్య దాడి చేశారు. అక్కడ 756 బస్తాల రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని ఎర్రగొండపాలెం గోడౌన్కు తరలించారు. మిల్లు యజమాని శ్రీనివాస్పై 6ఏ కేసు నమోదు చేశారు. కాగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రేషన్ బియ్యం వ్యాపార సామ్రాజ్యాన్ని వైసీపీ నాయకుడు నడుపుతున్నట్లు తెలుస్తోంది.
Updated Date - Mar 26 , 2024 | 01:08 AM