నేడు పలు జిల్లాల్లో వర్షాలు
ABN, Publish Date - Jun 10 , 2024 | 03:39 AM
ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు, పడమర మధ్య సముద్రమట్టానికి 3.6 కి.మీ నుంచి 7.6 కి.మీ. మధ్యన ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల ఉరుములు, పిడుగులు,
విశాఖపట్నం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర మీదుగా తూర్పు, పడమర మధ్య సముద్రమట్టానికి 3.6 కి.మీ నుంచి 7.6 కి.మీ. మధ్యన ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. మరిన్నిచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలో నెల్లూరు, ప్రకాశం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది.
Updated Date - Jun 10 , 2024 | 03:39 AM