స్కూల్ బస్సును ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్
ABN, Publish Date - Oct 22 , 2024 | 11:21 PM
మండలం లోని వంశధార నదీతీరం చెవ్వాకులపేట నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ రామ చంద్రాపురం వద్ద మంగళ వారం ఓ ప్రైవేటు బస్సును ఢీకొట్టింది.
ఆమదాలవలస, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలం లోని వంశధార నదీతీరం చెవ్వాకులపేట నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ రామ చంద్రాపురం వద్ద మంగళ వారం ఓ ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. గ్రామస్థుల కథనం మేరకు.. ట్రాక్టర్ డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించడంతో బస్సు ముందు భాగంలో ఢీకొట్టాల్సిన ట్రాక్టర్ వెనుక భాగానికి ఢీకొట్టింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఇసుక ట్రాక్టర్ బోల్తా
మండలంలోని గాజులకొల్లివలస సమీపంలో రహదారిపై మంగళవారం ఇసుక ట్రాక్టర్ బోల్తాపడింది. వంశధార నదీతీరం చెవ్వాకులపేట ర్యాంప్ నుంచి ఇసుక తరలిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో ఆ సమయంలో ప్రయాణికు లు, ట్రాక్టర్పై కూలీలు కూడా లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
Updated Date - Oct 22 , 2024 | 11:21 PM