పాము కాటుతో రైతు మృతి
ABN, Publish Date - Jul 26 , 2024 | 11:35 PM
పాగోడు పంచాయతీ వెలుసోద గ్రామానికి చెందిన గురువు త్రినాఽథరావు (58) పాము కాటుకు గురై గురువారం రాత్రి మృతి చెందారు.
జలుమూరు: పాగోడు పంచాయతీ వెలుసోద గ్రామానికి చెందిన గురువు త్రినాఽథరావు (58) పాము కాటుకు గురై గురువారం రాత్రి మృతి చెందారు. పొలంలో పని చేస్తుండగా పాము కాటు వేయడంతో వెంటనే కుటుంబ సభ్యులు నరసన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురు వారం రాత్రి మరణించినట్టు వారు తెలిపారు. త్రినాథరావుకి భార్య అప్పమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Updated Date - Jul 26 , 2024 | 11:35 PM