మద్యం మత్తులో హల్చల్
ABN, Publish Date - Sep 20 , 2024 | 11:46 PM
నగరంలోని కోరాడ వీధి సమీపం లో టిఫిన్ దుకాణం వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేసి అక్కడే ఉన్న ఇద్దరు విద్యార్థులపై దాడికి దిగాడు.
శ్రీకాకుళం క్రైం: నగరంలోని కోరాడ వీధి సమీపం లో టిఫిన్ దుకాణం వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేసి అక్కడే ఉన్న ఇద్దరు విద్యార్థులపై దాడికి దిగాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేర కు.. మండలవీధి సమీపంలోని కోరాడవీధి వద్ద గురువా రం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కోల కేశవ రావు అనే వ్యక్తి మద్యం మత్తులో టిఫిన్ చేసేందుకు దు కాణం వద్దకు వచ్చాడు. అదే సమయంలో ఇద్దరు విద్యా ర్థులు అక్కడ టిఫిన్ చేస్తున్నారు. కేశవరావు ఆ విద్యార్థు లతో దురుసుగా ప్రవర్తించాడు. ఇది తగదని తమని విడిచి పెడితే ఇంటికి వెళ్లిపోతామని ఆ విద్యార్థులు ప్రాఽథేయపడ్డారు. మద్యం మత్తులో ఉన్న కేశవరావు ఈ మాటలేవీ వినిపించుకోకుండా విద్యార్థులపై దాడికి ఎగబడ్డాడు. ఈ క్రమంలో విద్యార్థుల దుస్తులు చింపేసి కొట్టడంతో చేసేదిలేక ఆ విద్యార్థులు ఎదురుతిరిగారు. ఈ ఘటనలో కేశవరావుకు గాయాలు కాగా, విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులకు జరిగిన విషయాన్ని దాచిపెట్టి రాజీ అయిపోతామని కేశవరావు తెలిపాడు. దీంతో గొడవ సద్దుమణి గిందనుకున్న పోలీసులు.. శుక్రవారం కేశవరావు ఎంఎల్సీ రిపోర్టును చూసి ఆశ్చర్యపోయారు. మద్యంమత్తులో ఉన్న కేశవరావు రిమ్స్ ఆసుపత్రిలో చేరి, తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఔట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంఎల్సీ రిపోర్టు ఆధారంగా ఎస్ఐ హరికృష్ణ విచారణ చేపట్టారు.
Updated Date - Sep 20 , 2024 | 11:46 PM