ఆదమరిస్తే ప్రమాదం సుమా!
ABN, Publish Date - Oct 22 , 2024 | 11:48 PM
ww
బూర్జ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పాలవలస జంక్షన్ వద్ద ప్రధాన రహదారి మధ్యలో ఏర్ప డిన గొయ్యి వద్ద ప్రమాదం పొంచిఉంది. ఇక్కడ రహదారి మధ్యలో ఏర్పడిన గొయ్యిపై చెట్ల కొమ్మలు కప్పి ఉంచారు. ఏపాటి ఆదమరిచినా వాహనాలు గొయ్యిలోకి దిగబడే ప్రమాదముంది. పాలకొండ- శ్రీకాకుళం రహదారి కావడం తో నిత్యం రద్దీగా ఉంటోంది. ప్రధానంగా ఈ మార్గంలో చీకటి పడిన తర్వాత రాకపోకలు సాగించే వాహనాలు అటుగా వెళ్తే ప్రమాదం తప్పదన్న ఆందోళన నెలకొంది. ఆర్అండ్బీ అధికారులు గొయ్యిని పూడ్చాలని వాహన చోదకులు కోరుతున్నారు.
Updated Date - Oct 22 , 2024 | 11:48 PM