మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాంగ్రెస్‌లో చేరిన కృపారాణి

ABN, Publish Date - Apr 05 , 2024 | 11:35 PM

కేంద్ర మాజీమంత్రి, వైసీపీ జిల్లా పూర్వపు అధ్యక్షురాలు డాక్టర్‌ కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. కడప జిల్లా బద్వేల్‌లో పీసీసీ అధ్యక్షురాలు కాంగ్రెస్‌ పార్టీ బస్సుయాత్ర నిర్వహించారు.

కాంగ్రెస్‌లో చేరిన కృపారాణి
కృపారాణికి పార్టీ కండువా వేస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

టెక్కలి, ఏప్రిల్‌ 5: కేంద్ర మాజీమంత్రి, వైసీపీ జిల్లా పూర్వపు అధ్యక్షురాలు డాక్టర్‌ కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. కడప జిల్లా బద్వేల్‌లో పీసీసీ అధ్యక్షురాలు కాంగ్రెస్‌ పార్టీ బస్సుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల సమక్షంలో కృపారాణి, ఆమె భర్త డాక్టర్‌ కిల్లి రామ్మోహనరావు, తదితరులు పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం కృపారాణి మాట్లాడుతూ.. 2004లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో, ఇప్పుడు ఆయన కుమార్తె షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ చేరడం ఆనందంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. సోనియా, రాహుల్‌గాంధీ, ఖర్గే, ఇతర పెద్దలతో పాటు షర్మిలమ్మ నాయకత్వంలో ముందుకు నడుస్తానన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:35 PM

Advertising
Advertising