ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అప్పుల బాధ తాళలేక లైన్‌మన్‌ ఆత్మహత్య

ABN, Publish Date - Sep 20 , 2024 | 11:47 PM

బెల్లుకోలకు చెందిన లైన్‌మన్‌ మొగిలిపాటి శంకరరావు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నందిగాం: బెల్లుకోలకు చెందిన లైన్‌మన్‌ మొగిలిపాటి శంకరరావు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. శంకరరావు రధ జనబొడ్డపాడు సచివాలయంలో లైన్‌మన్‌గా విధులు నిర్వహి స్తున్నాడు. శంకరరావు అప్పులపాలై గత కొన్నిరోజులుగా మన స్తాపానికి గురి కావడంతో పాటు మరోవైపు కుమార్తె మృతి చెందిన బాధతో మరింత కుంగిపోయి ఇంట్లోని వంటగదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా శంకర రావుకు భార్య అనూష, కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సోదరుడు పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ షేక్‌మహ్మద్‌ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం

కంచిలి: స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలోని ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం గుర్తిం చినట్టు జీఆర్‌పీ హెచ్‌సీ హరినాథ్‌ తెలిపారు. మృతి చెందిన వ్యక్తికి సుమారు 50 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉంటుంద న్నారు. మృతదేహాన్ని గుర్తించిన వారు 9440627567 ఫోన్‌ నెంబరులో సంప్రదించాలని కోరారు.

Updated Date - Sep 20 , 2024 | 11:47 PM