రైల్వే ప్రయాణికులపై కందిరీగల దాడి
ABN, Publish Date - Mar 22 , 2024 | 12:09 AM
మందస రోడ్ (హరిపురం) రైల్వేస్టేషన్లో ప్రయాణికులపై గురువారం కందిరీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 40మందికి గాయాలయ్యాయి.
-40మందికి గాయాలు
హరిపురం, మార్చి 21: మందస రోడ్ (హరిపురం) రైల్వేస్టేషన్లో ప్రయాణికులపై గురువారం కందిరీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 40మందికి గాయాలయ్యాయి. విశాఖపట్నం వెళ్లేందుకు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ కోసం ప్రయాణికులు ప్లాట్ఫారంపై ఉన్న చెట్ల కింద ఉండగా పైనున్న కందిరీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో వారు భయంతో పరుగులు తీశారు. మరికొంతమంది స్టేషన్ గదుల్లోకి పారిపోయి తలుపులు వేసుకున్నారు. సుమారు 40మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది హరిపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స పొందారు. తీవ్ర గాయాలైన వారు ప్రయాణాలు రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. కాగా, గత సోమవారం ఇదే రైల్వే స్టేషన్లో అదేచోట కందిరీగలు దాడి చేయడంతో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మూడు రోజుల వ్యవధిలోనే మళ్లీ కందిరీగలు దాడి చేయడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రైల్వే అధికారులు స్పందించి కందిరీగల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Updated Date - Mar 22 , 2024 | 12:09 AM