అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
ABN, Publish Date - May 25 , 2024 | 11:49 PM
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 31 నుంచి జూన్ 5 వరకు కె.కొత్తూరు దరి ఆదిత్య ఇంజనీ రింగ్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్న అంతర్ జిల్లాల అండర్-19 క్రికెట్ పోటీలకు జిల్లా జట్టును శనివారం ఎంపిక చేశారు.
టెక్కలి: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 31 నుంచి జూన్ 5 వరకు కె.కొత్తూరు దరి ఆదిత్య ఇంజనీ రింగ్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్న అంతర్ జిల్లాల అండర్-19 క్రికెట్ పోటీలకు జిల్లా జట్టును శనివారం ఎంపిక చేశారు. కెప్టెన్గా వి.ప్రధ్నీష్సాయి, సుశాంత్, సిద్ధు విగ్నేష్, జయరాం, గోపాలకృష్ణ, ఎన్.రాజకుమార్, సాయి సుజన్, పూర్ణచంద్ర, జన్నారావు, ఎం.రోహిత్, థామస్ రామ్ కుమార్, నవీన్కుమార్ రెడ్డి, కల్యాణ్కుమార్, వినీల్సాగర్, అభయ్, సిద్ధులను ఎంపిక చేశారు. స్టాండ్బైగా వి.కృష్ణ, మోహనరావు, అభినయ్, వినయ్చంద్ర, పూజారి దినేష్, భరత్కుమార్లను ఎంపిక చేసినట్లు కోచ్, మేనేజర్ మేఘ నాథ్, నార్త్జోన్ సెలెక్టర్ బొడ్డేపల్లి వర్దన్ తెలిపారు. మే 31న శ్రీకాకుళం-తూర్పు గోదావరి, జూన్ ఒకటిన విజయనగరం- తూర్పు గోదావరి, జూన్ 2 విశాఖ-తూర్పుగోదావరి, జూన్ 3న విశాఖ-విజయ నగరం, జూన్ 4న విశాఖ-శ్రీకాకుళం, జూన్ 5న శ్రీకాకుళం- విజయనగరం జట్ల మధ్య పోటీ నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్ మైదానాన్ని అసోసియేషన్ ప్రతినిధులు పరిశీలించారు. అసోసియేషన్ సెక్రటరీ హాసన్ రాజషేక్, కోశాధికారి తైలాని, మెంటార్ ఇలియాస్ అహ్మద్, సెలెక్టర్ ఆర్సీ రెడ్డి, టోర్నమెంట్ కన్వీనర్ లాల్బహదూర్ తదితరులున్నారు. జూన్ 15 నుంచి అండర్-23 విభాగంలో క్రికెట్ పోటీలకు సన్నాహాలు చేస్తు న్నట్లు వారు పేర్కొన్నారు.
Updated Date - May 25 , 2024 | 11:49 PM