కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ పంద్కర్
ABN, Publish Date - Jul 02 , 2024 | 11:28 PM
జిల్లా కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ పంద్కర్ నియమిస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
- మనజీర్ జిలానీ సమూన్కు బదిలీ
శ్రీకాకుళం, జూలై 2(ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ పంద్కర్ నియమిస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల కలెక్టర్లను మంగళవారం సాయంత్రం బదిలీ చేసింది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్గా వ్యవహరిస్తున్న స్వప్నిల్ దినకర్ పంద్కర్ను బదిలీపై శ్రీకాకుళం కలెక్టర్గా నియమించింది. ఈయన 2016కు చెందిన ఐఏఎస్ అధికారి. గౌహతిలో ఐఐటీ కంప్యూటర్ సైన్స్చేసి.. ముందుగా ఐపీఎస్కు ఎంపికయ్యారు. తర్వాత ఐఏఎస్ కూడా సాధించారు. కాకినాడ, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేశారు. నూజివీడు సబ్కలెక్టర్గా, చిత్తూరు జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. విధినిర్వహణలో మంచిపేరు సంపాదించారు. త్వరలో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
- సార్వత్రిక ఎన్నికలకు ముందు నంద్యాల నుంచి జిల్లాకు వచ్చిన కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్కు బదిలీ అయింది. ఈయనకు పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారన్నదీ జాబితాలో ప్రకటించలేదు.
Updated Date - Jul 02 , 2024 | 11:28 PM