ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్షేమానికి కృషి

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:19 PM

‘ప్రజా సమస్యల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిస్తా. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తా’నని నూతన జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు జేసీ బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

- నూతన జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

కలెక్టరేట్‌, జూలై 26: ‘ప్రజా సమస్యల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిస్తా. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కృషి చేస్తా’నని నూతన జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు జేసీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రతీ వారం డివిజన్‌, మండల స్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. 2020 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ తొలుత నెల్లూరులో ట్రైనీ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం రాజంపేటలో సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత అన్నమయ్య జిల్లా జేసీగా పనిచేస్తూ బదిలీపై జిల్లాకు వచ్చారు. శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన జేసీకి జిల్లా అధికారులు, తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 11:19 PM

Advertising
Advertising
<