ఓటమి భయంతోనే వైసీపీ దాడులు
ABN, Publish Date - May 15 , 2024 | 11:24 PM
వైసీపీకి ఓటమి తప్పదని స్పష్టం కావడంతో నిస్పృహలోనే రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు దాడులు, అల్లర్లకు పాల్పడుతున్నాయని మాజీ విప్, టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరు లతో మాట్లాడారు.
మాజీ విప్ కూన రవికుమార్
పొందూరు: వైసీపీకి ఓటమి తప్పదని స్పష్టం కావడంతో నిస్పృహలోనే రాష్ట్రంలో వైసీపీ శ్రేణులు దాడులు, అల్లర్లకు పాల్పడుతున్నాయని మాజీ విప్, టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరు లతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమైందన్నారు. అధికార వైసీపీ ప్రభు త్వంపై కోపంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారన్నారు. స్థానిక ఎన్ని కలలో అధికార పార్టీకి తొత్తులుగా మారిన కొంతమంది పోలీసులు అధి కార పార్టీ దౌర్జన్యాలకు సహకరించారని, కాని ఎలక్షన్ కమిషన్ ముందు చూపుతో అధికార పార్టీకి అనుకూల అధికా రులను బదిలీ చేయడంతో దౌర్జన్యాలు చేయడానికి అవ కాశాలు లేక వైసీపీ నాయకులు నిష్పక్ష పాతంగా విధులు నిర్వహించిన అధికారులు, ఎలక్షన్ కమిషన్పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజలు ప్రజలు కూటమివైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
మాజీ సర్పంచ్ కుటుంబానికి పరామర్శ
పొందూరు మాజీ మేజర్ కాకర్ల పైడిలింగం కుటుం బాన్ని బుధవారం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కూన రవికుమార్ పరామర్శించారు. ఈనెల 12న పైడిలింగం మృతిచెందిన విషయం తెలుసుకుని ఆయన కోడలు, వైస్ ఎంపీపీ చెల్లమాంబ, కుమారుడు మాజీ వైస్ ఎంపీపీ కాకర్ల రాజారావులను కలిసి సానుభూతి తెలిపారు. రవి కుమార్తో పాటు ఏఎంసీ మాజీ చైర్మన్ అన్నెపు రాము, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చినరంగ, వై.కిషోర్, కె.శ్రీని వాసరావు, డి.రవికుమార్ తదితరులు ఉన్నారు.
Updated Date - May 15 , 2024 | 11:24 PM