ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బాబు చేతిలో పావులుగా సునీత, షర్మిల

ABN, Publish Date - Apr 17 , 2024 | 03:35 AM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేతిలో పావులుగా సునీత, షర్మిల పనిచేస్తున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి

సీబీఐ, దస్తగిరి, సునీత మధ్య చీకటి డీల్‌

మూడేళ్లుగా వ్యక్తిత్వ హననం: అవినాశ్‌

కడప (ఎర్రముక్కపల్లె), ఏప్రిల్‌ 16: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేతిలో పావులుగా సునీత, షర్మిల పనిచేస్తున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, దస్తగిరి, వైఎస్‌ సునీత మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, మూడేళ్లుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని అన్నారు. మంగళవారం కడపలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాక్షిగా ఉన్న వాచ్‌మన్‌ రంగన్న పేర్కొన్న నలుగురిని అరెస్టు చేసి సమాచారం రాబట్టాల్సి ఉండగా, నెలరోజుల పాటు ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదన్నారు. దస్తగిరి హత్య చేశానని ఒప్పుకొన్నా అరెస్టు చేయకుండా ఇంటికి పంపారనీ, అతడు యాంటిసిపేటరీ బెయిల్‌ అడిగితే, సునీత అభ్యంతరం చెప్పలేదన్నారు. వివేకా సొంత బామ్మర్ది శివప్రకాశ్‌ చెబితేనే తాను ఆయన ఇంటికి వెళ్లానన్నారు. ఆ తరువాతే తాను సమాచారం ఇచ్చానని చెప్పారు.

Updated Date - Apr 17 , 2024 | 03:35 AM

Advertising
Advertising