ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అరాచక ప్రభుత్వాన్ని తరిమికొట్టారు

ABN, Publish Date - Jun 06 , 2024 | 12:10 AM

అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ అన్నారు. బుధవారం స్థానిక రామ్‌నగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు వడ్డే అంజినప్పతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

మీడియాతో మాట్లాడుతున్న వెంకటశివుడు యాదవ్‌

టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌

అనంతపురం అర్బన, జూన 5: అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ అన్నారు. బుధవారం స్థానిక రామ్‌నగర్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు వడ్డే అంజినప్పతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీయూ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారన్నారు. దేశంలోనే బలమైన పార్టీగా టీడీపీ అవతరించిందన్నారు. జగన, వైసీపీ నేతల అహంకారం, సైకో విధానాలను భరించలేక అన్ని వర్గాల ప్రజలు వైసీపీని కూకటివేళ్లతో పెలికించారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ రథసారధి నారాలోకేశపై నమ్మకంతో ప్రజలు ఈ తీర్పునిచ్చి ఏపీలో స్వర్ణయుగానికి బీజం వేశారన్నారు. ఉమ్మడి అనంత జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేందుకు కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి అనంత జిల్లాను అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవళ్ల మురళీ, సుధాకర్‌ యాదవ్‌, కురుబ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 12:10 AM

Advertising
Advertising