ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లాకు 850 పశువుల గోకులం షెడ్లు మంజూరు

ABN, Publish Date - Jun 21 , 2024 | 12:26 AM

జిల్లాకు 850 పశువుల గోకులాల షెడ్లు మంజూరు అయినట్టు పశుసంవర్థక శాఖ జిల్లా డిప్యూటీడైరెక్టర్‌ నరసింహ తెలిపారు.

కోటవురట్లలో జరిగిన అవగాహన సదస్సులోమాట్లాడుతున్న డీడీ నరసింహ

పశుసంవర్థక శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ నరసింహ

కోటవురట్ల, జూన్‌ 20: జిల్లాకు 850 పశువుల గోకులాల షెడ్లు మంజూరు అయినట్టు పశుసంవర్థక శాఖ జిల్లా డిప్యూటీడైరెక్టర్‌ నరసింహ తెలిపారు. గురువారం స్ధానిక మండల పరిషత్‌ సమవేశమందిరంలో మాకవరపాలెం, కోటవురట్ల మండలాలకు చెందిన పశుసంవర్థక శాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోకులాల షెడ్లు పశువులు పెంపకందారులకు మాత్రమే మంజూరు చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నారు. జిల్లాలో ప్రతి మండలానికి 40 నుంచి 45 వరకు గోకులాల షెడ్లు కేటాయిస్తామన్నారు. ఈ సీజన్‌లో అధికంగా పశువులకు గొంతువాపు, జబ్బవాపు వ్యాధులు సోకే ప్రమాదం వుందన్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా వ్యాక్సిన్లు వేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏడీ సింహద్రప్పడు, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 12:26 AM

Advertising
Advertising