AP News: అప్పన్న దేవాలయంలో నరసింహ దీక్షల విరమణ
ABN, Publish Date - Jan 06 , 2024 | 09:28 AM
Andhrapradesh: సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో నరసింహ దీక్షలు విరమణ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. మండల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి దీక్ష పూజలను నిర్వహించిన భక్తులు దీక్షల విరమణ కోసం కొండకు చేరుకుంటున్నారు.
విశాఖపట్నం, జనవరి 6: సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో నరసింహ దీక్షల విరమణ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. మండల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి దీక్ష పూజలను నిర్వహించిన భక్తులు దీక్షల విరమణ కోసం కొండకు చేరుకుంటున్నారు. అరకు పాడారు ముంచింగిపుట్టు గిరిజన ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భ్తక్తులు కొండకి చేరుకున్నారు. ఇరుముడితో కొండకు చేరుకున్న భక్తులకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇరుముడి భక్తులకు స్వామివారి అంతరాలయం దర్శనం అనంతరం ఇరుముడి విసర్జన అనంతరం లడ్డు ప్రసాదాన్ని దేవస్థానం అధికారులు అందజేశారు. సుమారు 2000 పైగా అప్పన స్వామి భక్తులు ఈ మాల విసర్జన కార్యక్రమంలో పాల్గొంటారని దేవస్థానం ఈవో శ్రీనివాస్ మూర్తి తెలియజేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jan 06 , 2024 | 09:29 AM