ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రెండు రోజులైనా తొలగించని వైసీపీ రంగులు

ABN, Publish Date - Mar 19 , 2024 | 12:51 AM

మండలంలో ఎన్నికల నియమావళిని అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయడంలేదు. ప్రభుత్వ, పబ్లిక్‌ ఆస్తులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు, బొమ్మలు, రంగులు, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగులు వంటి వాటిని తొలగించాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది.

అచ్యుతాపురం మండల కాంప్లెక్స్‌ ఆవరణలో వైసీపీ జెండా రంగులతో వున్న స్టేజీ

అచ్యుతాపురం మండలంలో సరిగా అమలుకాని కోడ్‌

అచ్యుతాపురం, మార్చి 18: మండలంలో ఎన్నికల నియమావళిని అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయడంలేదు. ప్రభుత్వ, పబ్లిక్‌ ఆస్తులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు, బొమ్మలు, రంగులు, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగులు వంటి వాటిని తొలగించాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. మండలంలో ఒకింత ఆలస్యంగా అయినా చాలావరకు వీటిని తీసివేయించిన అధికారులు, కొన్నిచోట్ల ప్రభుత్వ కట్టడాలకు వేసిన వైసీపీ జెండా రంగులను మాత్రం తుడిచివేయలేదు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఆవరణలో ఉన్న స్టేజీకి గతంలో వైసీపీ జెండా తరహాలో పైన ఆకుపచ్చ, మధ్యలో తెలుపు, దిగువున నీలం రంగులు వేయించారు. తహసీల్దార్‌, ఎంపీడీవో, పోలీస్‌స్టేషన్‌, ఎంఈఓ, స్త్రీశక్తి, పీహెచ్‌సీ, ఎంఈఓ, హౌసింగ్‌, గ్రంథాలయ శాక భవనాలన్నీ ఇక్కడే వుంది. నిత్యం ఆయా కార్యాలయాల్లో వివిధ పనుల నిమిత్తం వందలాది మంది వచ్చిపోతుంటారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి రెండు రోజులు దాటినప్పటికీ స్టేజీకి వేసిన వైసీపీ రంగులను మాత్రమే అధికారులు తొలగించలేదు.

Updated Date - Mar 19 , 2024 | 12:51 AM

Advertising
Advertising