తహసీల్దార్లకు పోస్టింగులు కేటాయింపు
ABN, Publish Date - Jul 26 , 2024 | 11:24 PM
ఎన్నికల విధుల అనంతరం ఇతర జిల్లాల నుంచి జిల్లాకు వచ్చిన తహసీల్దార్లకు పోస్టింగ్లు కేటాయిస్తూ కలెక్టర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
కలెక్టరేట్, జూలై 26: ఎన్నికల విధుల అనంతరం ఇతర జిల్లాల నుంచి జిల్లాకు వచ్చిన తహసీల్దార్లకు పోస్టింగ్లు కేటాయిస్తూ కలెక్టర్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు జిల్లాలో ప్రస్తుతం పని చేస్తున్న నలుగురు తహసీల్దార్లకు స్థానాలు మార్పు చేశారు. మెరకముడిదాం తహసీల్దార్గా రఫీజాన్, బొండపల్లి తహసీల్దార్గా డి.రాజేశ్వరరావు, గజపతినగరం బి.రత్నకుమార్, ఎస్.కోట ఎం.అరుణకుమారి, సంతకవిటి టి.కళ్యాణచక్రవర్తి, తెర్లాం జి.హేమంత్కుమార్, గరివిడి సీహెచ్ బంగారురాజు, పూసపాటిరేగ తాడ్డి గోవింద, దత్తిరాజేరు పి.విజయభాస్కర్, కొత్తవలస బి.నీలకంఠరావు, మెంటాడ కె.శ్రీనివాసరావు, గుర్ల పి.ఆదిలక్ష్మి, డెంకాడ వి.పద్మావతి, భోగాపురం ఎం.సురేష్, విజయనగరం ఎన్.కూర్మనాథరావు, రేగిడి ఆమదాలవలస డి.యల్లారావు, బాడంగి కె.సుధాకర్, బొబ్బిలి ఎం.శ్రీను, చీపురుపల్లి ఎన్.రాజారావు, నెల్లిమర్ల తహసీల్దార్ బి.సుదర్శనరావు, వంగర తహసీల్దార్గా డి.ధర్మరాజు నియమితులయ్యారు. అదేవిధంగా కలెక్టరేట్ ఏవోఎల్ఆర్, ఈసెక్షన్ సూపరింటెండెంట్గా కె.శ్రీకాంత్, డి, ఎఫ్ సెక్షన్ పర్యవేక్షకులుగా టి.రామకృష్ణ, సి.సెక్షన్ పర్యవేక్షకులుగా శ్రీనివాస్ మిశ్రా, హెచ్ సెక్షన్ పర్యవేక్షకులుగా ఐ.భాస్కర్రావు నియమిస్తూ ఉత్వర్తులు ఇచ్చారు. కలెక్టరేట్ ఏవోగా బీఎస్ దేవిప్రసాద్, చీపురుపల్లి ఆర్డీవో కార్యాలయ ఏవోగా ఆర్.ఈశ్వరరమ్మ, ప్రత్యేక తహసీల్దార్ కేఆర్ఆర్సీ (కలెక్టరేట్) కె.ఆదిబాబు, విజయనగరం ఆర్డీవో కార్యాలయ ఏవోగా డి.శ్రీనివాసరావును నియమితులయ్యారు. వీరు వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించారు.
Updated Date - Jul 26 , 2024 | 11:24 PM