ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బేబీనాయన ఇంటింటి ప్రచారం

ABN, Publish Date - Apr 13 , 2024 | 12:25 AM

టీడీపీ, జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) శుక్రవారం పాతబొబ్బిలి 1, 2 వార్డులలో ఇంటింటి ప్రచారం చేశారు.

బొబ్బిలి: టీడీపీ, జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) శుక్రవారం పాతబొబ్బిలి 1, 2 వార్డులలో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రసాద్‌నగర్‌ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని మహిళలు ఆయనకు చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని... అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చారు. ఆయన వెంట రెండు వార్డుల ఇన్‌చార్జిలు, పార్టీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

గొంగాడవలస, అన్నం నాయుడువలస గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ జి.శ్రీనివాసరావు, కొట్నాన శ్రీను, గుల్ల లక్ష్మణ ఆధ్వర్యంలో వంద కుటుంబాలు శుక్రవారం బొబ్బిలి కోటలో బేబీనాయన సమక్షంలో టీడీపీలో చేరాయి. కలవరాయి, వాకాడ వలస గ్రామాలకు చెందిన వైసీపీ మాజీ సర్పంచ్‌ పాటూరి కృష్ణమూర్తి, వాకాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 60 కుటుంబాలవారు వైసీపీని వీడి బేబీనాయన సమక్షంలో టీడీపీలో చేరారు. మెట్టవలసలో శుక్రవారం రాత్రి వైసీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీడీపీ చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి సత్యనారాయణ, సీనియర్‌ నేత అల్లాడ భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:25 AM

Advertising
Advertising