వసంతగెడ్డలో మృతదేహం లభ్యం
ABN, Publish Date - Sep 13 , 2024 | 12:05 AM
:మండలంలోని చంద్రంపేట-వసంత గ్రామాల మధ్య వసంతగెడ్డలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎల్.కోట మండలంలోని చందులూరుకి చెందిన బత్తులుసతీష్(38)తన భార్య వరలక్ష్మితోకలిసి ద్విచక్రవాహనంపై బుధవా రం మధ్యాహ్నం తన అత్తవారి గ్రామం చంద్రంపేట వచ్చి తిరిగి చందులూ రుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు.
గంట్యాడ:మండలంలోని చంద్రంపేట-వసంత గ్రామాల మధ్య వసంతగెడ్డలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎల్.కోట మండలంలోని చందులూరుకి చెందిన బత్తులుసతీష్(38)తన భార్య వరలక్ష్మితోకలిసి ద్విచక్రవాహనంపై బుధవా రం మధ్యాహ్నం తన అత్తవారి గ్రామం చంద్రంపేట వచ్చి తిరిగి చందులూ రుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ సమయంలో చంద్రంపేట-వసంత మధ్య ఉన్న గెడ్డ వద్ద అదుపు తప్పి వాహనం పడిపోయిన సంగతి విదితమే. దీంతో సతీష్ ఆచూకీకోసం గాలించినా లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరో సారి గురువారం ఉదయం గాలించగా సతీష్ మృతదేహం గెడ్డలో లభ్యమైం ది. ఈమేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్.కోటఆసుపత్రికి తరలించా రు. సతీష్ మృతికి టీడీపీ నాయకులు కొండపల్లి కొండలరావు, పార్టీ మండలా ధ్యక్షుడు కొండపల్లి భాస్కర్నాయడు, నాయకులు బూడి అప్పలనాయుడు, రంది చినరామునాయుడు, జి.శ్రీనివాసరావు సంతాపం తెలిపారు.
Updated Date - Sep 13 , 2024 | 12:05 AM