ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ రెండింటిపై ఉత్కంఠ

ABN, Publish Date - Jun 03 , 2024 | 11:21 PM

చంద్రంపేట (బూత్‌ 223), రామవరంలో (బూత్‌ 232)ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. గత నెల 13న పోలింగ్‌ రోజున ఈ రెండు బూత్‌ల్లో మాక్‌ పోలింగ్‌ క్లియర్‌ చేయకుండా ఈవీఎంల్లో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు.

ఆ రెండింటిపై ఉత్కంఠ

మాక్‌పోల్‌ క్లియర్‌ చేయకుండా ఈవీఎంలో ఓటింగ్‌

గంట్యాడ, జూన్‌ 3: చంద్రంపేట (బూత్‌ 223), రామవరంలో (బూత్‌ 232)ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. గత నెల 13న పోలింగ్‌ రోజున ఈ రెండు బూత్‌ల్లో మాక్‌ పోలింగ్‌ క్లియర్‌ చేయకుండా ఈవీఎంల్లో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. చంద్రంపేట గ్రామంలో మొత్తం 883 మంది ఓటర్లు ఉండగా 739 ఓట్లు పోలయ్యాయి. ఈ బూత్‌లో పార్లమెంట్‌ స్థానానికి సీఆర్‌సీ(మాక్‌ పోలింగ్‌ క్లియర్‌) చేశారు కాని అసెంబ్లీ స్థానానికి సీఆర్‌సీ చేయనట్లు అధికారులు వెల్లడించారు. ఇక రామవరంలోని బూత్‌ నెంబరు 232లో అసెంబ్లీ, పార్లమెంట్‌ రెండు స్థానాలకూ సీఆర్‌సి చేయకుండా ఓటింగ్‌ మొదలు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బూత్‌లో 970 ఓట్లు ఉండగా 861 ఓట్లు పోలయ్యాయి. మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపు సమయంలో ఈ రెండు బూత్‌లు మిగిలిన బూత్‌ల ప్రకారం లెక్కించడానికి అవకాశం లేనట్లు తెలుస్తోంది. బరిలో దిగిన అభ్యర్థులు ఎవరికైనా ఈ రెండు బూత్‌ల ఓట్లతో సంబంధం లేకుండా అత్యధిక మెజార్టీతో గెలిస్తే వీటి కౌంటింగ్‌ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

------------------

Updated Date - Jun 03 , 2024 | 11:21 PM

Advertising
Advertising