పరిసరాల పరిశుభ్రత పాటించండి
ABN, Publish Date - Jul 27 , 2024 | 12:01 AM
ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించా లని డీఎంహెచ్వో ఎస్.భాస్కర రావు కోరారు.
డెంకాడ: ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించా లని డీఎంహెచ్వో ఎస్.భాస్కర రావు కోరారు. మోపాడ పీహెచ్సీ పరిధిలోగల జొన్నాడ గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో దోమలు వృద్ధి చెందకుండా కొబ్బరి చిప్పలు, వాడేసిన టీ కప్పులు, పాత టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అనంతరం స్థానిక వెల్నెస్ సెంటర్ను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఉందని, ఆరోగ్య చైతన్య సదస్సులు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మోపాడ వైద్యాధికారి డా.శరణ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2024 | 12:01 AM