ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గూడ్స్‌ కింద పడి వ్యక్తి మృతి

ABN, Publish Date - Aug 26 , 2024 | 12:10 AM

దిబ్బగుడ్డివలస రైలు గేట్‌ ఎన్‌సీ వద్ద శనివారం రాత్రి 7 గంటల సమయంలో గూడ్స్‌ రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు.

బొబ్బిలి: దిబ్బగుడ్డివలస రైలు గేట్‌ ఎన్‌సీ వద్ద శనివారం రాత్రి 7 గంటల సమయంలో గూడ్స్‌ రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం... బొబ్బిలి పట్టణానికి చెందిన ధర్మవరపు చిన్నారావు (74) వృత్తి రీత్యా కరెంటు పనులు చేస్తుంటారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కరెంటు పనులు చేస్తుంటారు. శనివారం దిబ్బగుడ్డివలసకు కరెంటు పనులకు ద్విచక్ర వాహనంపై చిన్నారావు వెళ్లాడు. రాత్రి 9 గంటల వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన భార్య సత్యవతి...తండ్రిని వెదికేందుకు కుమారుడిని పంపించడంతో విషయం తెలిసింది. సమాచారం అందుకున్న ఆర్‌పీ హెచ్‌సీ బి.ఈశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Aug 26 , 2024 | 12:10 AM

Advertising
Advertising
<