మొండెంఖల్లో ప్రజాదర్బార్
ABN, Publish Date - Oct 23 , 2024 | 12:00 AM
మొండెంఖల్ కేంద్రంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహిం చారు.
కురుపాం రూరల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మొండెంఖల్ కేంద్రంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహిం చారు. మొండెంఖల్కు సమీపంలో గల ఆరు పంచాయతీలకు చెందిన ప్రజ లు పలు సమస్యలపై అర్జీలు ఇచ్చారు. మొత్తం 680 అర్జీలు రాగా, ఎక్కువ గా పింఛన్లు, గృహాలు మంజూరు చేయాలంటూ అభ్యర్థించారు. ఈ అర్జీలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏజన్సీ ప్రాంతాల్లోని మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామ న్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కలిశెట్టి కొండయ్య, పార్టీ అధికార ప్రతినిధి కోలా రంజిత్కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Oct 23 , 2024 | 12:00 AM