సమస్య రాకుండా ముందే స్పందించాలి: ఎస్పీ
ABN, Publish Date - Oct 22 , 2024 | 11:57 PM
సమస్య వచ్చిన తర్వాత కాకుండా, ముందే సమాచార సేకరణ చేసి, స్పందించాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు.
సాలూరు రూరల్, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): సమస్య వచ్చిన తర్వాత కాకుండా, ముందే సమాచార సేకరణ చేసి, స్పందించాలని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. సాలూరు రూరల్ పోలీస్స్టేషన్ను ఆయన మంగళవారం సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. కేసుల పరిష్క రంపై రూరల్ ఎస్ఐ పి.నరసింహమూర్తిని ప్రశ్నించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పార్వతీపురం ఎస్డీపీవో అంకిత్ మహావీర్ సురాన, సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ మక్కువ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక పోలీస్స్టేషన్ను ఎస్పీ మాధవరెడ్డి మంగళవారం సందర్శించారు. స్టేషన్, సీఆర్పీఎఫ్ క్యాంప్ ఆఫీస్లను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఏఎస్పీ అంకిత సురానా, సీఐ రామకృష్ణ, ఎస్ఐ వెంకటరమణమూర్తి పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 11:57 PM