సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలి
ABN, Publish Date - Sep 21 , 2024 | 12:04 AM
ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు.
విజయనగరం టౌన్: ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ను వినియోగించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు. విజయనగరం మండలంలోని జొన్నవలసలో శుక్రవారం ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కార్యక్రమంలో మాట్లాడుతూ పథకంలో భాగంగా సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. గృహ వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎంపీటీసీ సభ్యులు రాజేష్బాబు పాల్గొన్నారు.
Updated Date - Sep 21 , 2024 | 12:04 AM