ఆడ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ABN, Publish Date - Jun 08 , 2024 | 12:40 AM
ఆడ పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని గరివిడి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఆరుద్ర సూచించారు.
గుర్ల: ఆడ పిల్లల విద్య విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని గరివిడి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ఆరుద్ర సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఐసీడీఎస్ పరిధిలో ఉన్న అంగన్వా డీ, ఆశావర్కర్లకు, ఏఎన్ఎంలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ ఆడపిల్లల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పౌష్టికాహారం, రక్తహీనత లేకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ మేరకు గుర్ల పీహెచ్సీ పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలకు ఏఎన్ఎం, ఆశాలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పిల్లల పెంపకంలో కుటుంబం, సమాజానికి అవగాహన పెంపొందించుట, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. జిల్లా స్థాయిలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఐసీడీఎస్, హెల్త్, డీఆర్డీఏ, వెలుగు డిపార్ట్మెంట్లకు శిక్షణ ఇచ్చారు. అలాగే ఈ టీవోటీ ద్వారా ఫ్రంట్లైన్ వర్కర్స్ అయిన ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. వారు క్షేత్ర స్థాయిలో తల్లులతో సమావేశాలు ఏర్పాటు చేసి, శిక్షణలోని అంశాలను తెలియజేయాలన్నారు.
Updated Date - Jun 08 , 2024 | 12:40 AM