కదం తొక్కారు
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:20 AM
సీతంపేట ఏజెన్సీ గిరిజనులు తమ సమస్యలపై కదంతొక్కారు.
సీతంపేట రూరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీ గిరిజనులు తమ సమస్యలపై కదంతొక్కారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ పార్క్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వ హించారు. అనంతరం ఐటీడీఏ గేటు వద్ద బైఠా యించారు. ఈసందర్భంగా గిరిజన సంఘం నాయ కులు తిరుపతిరావు, సాంబయ్యలు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో రహదారులు, తాగునీటి సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ బిడ్డలు కోసం ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని కోరారు. వచ్చే సోమవారం నాటికి తామ సమస్యలపై అధికారులు స్పందించకుంటే ఐటీడీఏ కార్యాలయంలో వంట- వార్పు కార్యక్రమం నిర్వహి స్తామని హెచ్చరించారు. ఈసందర్భంగా డీడీ అన్నదొరకు వినతిపత్రాన్ని అందజేశారు. గిరి జన సంఘం నాయకులు జి.సుందరమ్మ, పి.సాంబ య్య, భాస్కరరావు, గంగాధర్ పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 12:20 AM