ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

ABN, Publish Date - Oct 21 , 2024 | 11:47 PM

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరువీరుల కుటుంబాలకు అండగా ఉంటామని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే తదితరులు

బెలగాం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరువీరుల కుటుంబాలకు అండగా ఉంటామని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఎస్పీ మాధవరెడ్డి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జాతీయ పోలీసు అమర వీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. వారి త్యాగాలు మరువలేమన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను సత్కరించి యోగక్షేమాలు అడిగి తెలుసు కున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ దిలీప్‌కిరణ్‌, పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2024 | 11:47 PM