ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కన్నీటి వేదన..

ABN, Publish Date - Jul 26 , 2024 | 12:46 AM

గత గురువారం పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడడంతో వరద వెల్లువలా ఊళ్లపై పడి విధ్వంసాన్ని సృష్టించింది. ఒక్కసారిగా వరద మృత్యువులా తరుముకుని రావడంతో అయా గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులూ తీస్తూ ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు.

ఇళ్లు కొట్టుకుపోయి నిలువ నీడ కరువు

గుడారాల్లో తలదాచుకుంటున్న వైనం

అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన

వేలేరుపాడు, జూలై 25 : గత గురువారం పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడడంతో వరద వెల్లువలా ఊళ్లపై పడి విధ్వంసాన్ని సృష్టించింది. ఒక్కసారిగా వరద మృత్యువులా తరుముకుని రావడంతో అయా గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులూ తీస్తూ ఎత్తైన ప్రదేశాలకు చేరుకున్నారు. తమ కళ్ళ ముందే ఎంతో కాలంగా కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు, సామాన్లు, వరదలో కొట్టుకుపోతుంటే చేసేదేమీలేక అసహాయకులుగా చూస్తూ ఉండిపోయారు. నిలువ నీడ లేక కట్టుబట్టలతో మిగిలారు. మండలంలోని కమ్మరగూడెం, మేడేపల్లి, అల్లూరి నగర్‌, ఒంటిబండ, కోయమాదారం, ఊటగుంపు, రామవరం, రాళ్లపూడి, సొందే గొల్లగూడెం, వసంతవాడ, పాత పుచ్చిరాళ్ల గ్రామాలు పెద్దవాగు బారిన పడ్డాయి. అయా గ్రామస్థులు వరద తగ్గిన తర్వాత గ్రామాల్లోకి వచ్చి చూసుకుంటే తమ ఇళ్లు అనవాళ్లు కూడా లేకుండా వరదల్లో కొట్టుకుపోవడంతో గుండెలు బాదుకున్నారు. జిల్లా అధికారులు వరద తగ్గిన అనంతరం గ్రామాల్లో సహాయక చర్యలు ప్రారం భించిన అవిఅరకొరగానే ఉన్నాయన్నది బాధితుల ఆరోపణ. వండుకునేందుకు గిన్నెలు కూడా లేకపోవడంతో అధికారులే భోజన సదుపాయం కల్పించారు. వరద ప్రభావిత గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి పరామర్శలకు వచ్చిన సమయంలో అన్ని విధాలా ఆదుకుంటామని హామీలిచ్చారు. వారం గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు భోజనం, తాగునీరు తప్ప మరే సహాయం అందలేదని బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్దవాగు వరదల కారనంగా పూర్తిగా నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కూలిన ఇళ్ల స్థానంలో పక్కాఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పినప్పటికి ఇప్పటి వరకు అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదని అల్లూరి నగర్‌ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వరదల్లో ఇళ్లు కూలిపోవడంతో తాత్కాలికంగా గుడారాలు వేసుకుని వాటిలోనే నివాసం ఉంటున్నామని బాధితులు తెలిపారు. వరదల కారణంగా నష్ట పోయిన తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సర్వస్వం కోల్పోయాం

వరదకు ఇంట్లోని సామాన్లు మొత్తం తడిచి పోయాయి. గతేడాదే అప్పుచేసి చిన్నపాటి పక్కాఇల్లు నిర్మించుకున్నాం. వరద ధాటికి సగం ఇల్లు కూలి పోయింది. పొలంలో ఇసుక మేటలు వేయడంతో వ్యవ సాయం చేసే వీలు లేకుండా పోయింది. నేటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

– పూసం సీతమ్మ, అల్లూరి నగర్‌.

ఇల్లు కొట్టుకుపోయింది.

వరదకు మా పూరిల్లు కొట్టుకు పోయింది. కట్టుకున్న బట్టలు తప్ప మరేమీ మిగలలేదు. ఉండటానికి ఇల్లు లేకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వం ఇచ్చిన టార్ఫాలిన్‌తో చిన్న గుడారం వేసుకుని ఉంటున్నాం. అధికారులు బుధవారం వరకు భోజన సదుపాయం కల్పించారు. ప్రస్తుతం అది కూడా నిలిపివేశారు. నష్టపోయిన మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి.

– పూసం నాగేశ్వరరావు, అల్లూరినగర్‌

Updated Date - Jul 26 , 2024 | 12:46 AM

Advertising
Advertising
<